కోవిడ్ ఎఫెక్ట్ : ప్రైవేట్ రంగానికి ఆర్ధిక సాయం కొనసాగించనున్న సౌదీ ప్రభుత్వం
- July 03, 2020
సౌదీ:కరోనా సంక్షోభంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ రంగాన్ని ఆదుకునేందుకు చేపట్టిన చర్యలను కొనసాగించాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్నాళ్లు ప్రైవేట్ రంగానికి అందిస్తున్న ఆర్ధిక సాయాన్ని కొనసాగించనుంది. ప్రైవేట్ సెక్టార్ లోని వేతనాల్లో 60 శాతం జీతాలను భరించేలా నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న నిరుద్యోగభృతి 'సనెద్' పథకం ద్వారా ఈ అర్ధిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. అయితే..వ్యాట్ ను మూడింతలు చేసిన మరుసటి రోజే ఉద్దీపన చర్యలకు సంబంధించి ప్రకటన వెలువడటం గమనార్హం. 15 శాతం అమలు చేయటం వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ రంగానికి ఆర్ధిక తోడ్పాటు అందించేలా నిర్ణయించింది సౌదీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







