కోవిడ్ ఎఫెక్ట్ : ప్రైవేట్ రంగానికి ఆర్ధిక సాయం కొనసాగించనున్న సౌదీ ప్రభుత్వం
- July 03, 2020
సౌదీ:కరోనా సంక్షోభంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న ప్రైవేట్ రంగాన్ని ఆదుకునేందుకు చేపట్టిన చర్యలను కొనసాగించాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్నాళ్లు ప్రైవేట్ రంగానికి అందిస్తున్న ఆర్ధిక సాయాన్ని కొనసాగించనుంది. ప్రైవేట్ సెక్టార్ లోని వేతనాల్లో 60 శాతం జీతాలను భరించేలా నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న నిరుద్యోగభృతి 'సనెద్' పథకం ద్వారా ఈ అర్ధిక సాయం అందించనున్నట్లు వెల్లడించింది. అయితే..వ్యాట్ ను మూడింతలు చేసిన మరుసటి రోజే ఉద్దీపన చర్యలకు సంబంధించి ప్రకటన వెలువడటం గమనార్హం. 15 శాతం అమలు చేయటం వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తుందని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ రంగానికి ఆర్ధిక తోడ్పాటు అందించేలా నిర్ణయించింది సౌదీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







