సౌదీ, యూఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్..ఇండియన్స్ నుంచి భారీగా బంగారం పట్టివేత
- July 04, 2020కరోనాతో గల్ఫ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన ప్రవాస భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే..స్వదేశానికి వస్తూ భారీగా బంగారంతో ఇండియాకి చేరుకున్న 14 మంది ప్రవాస భారతీయులు ఇండియన్ కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. 14 మంది నుంచి Dh7.7 మిలియన్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.రస్ అల్ ఖైమా నుంచి ఇండియా చేరుకున్న ముగ్గురు ప్రయాణికుల నుంచి 9.33 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 45 లక్షలు. సౌదీ నుంచి వచ్చిన మరో 11 మంది నుంచి 22.652 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 11 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారులను తప్పించుకునేందుకు బంగారాన్ని ఎమర్జెన్సీ లైట్స్ లో అమర్చారు. అయితే..అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయటంతో బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- కవితకు మరోసారి షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు..
- ఏపీలో కౌంటింగ్కు సర్వంసిద్దం..
- కువైట్లో ఔట్ డోర్ పనుల పై నిషేధం
- యూఏఈలో రోడ్ ఎంట్రీ నిబంధనలు..ఉల్లంఘనకు DH400 ఫైన్, 4 బ్లాక్ పాయింట్లు
- గల్ఫ్ చెల్లింపుల వ్యవస్థలో చేరిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్
- సౌదీ అరామ్కో $12 బిలియన్ల వాటా గంటల్లో సేల్: బ్లూమ్బెర్గ్
- ఉమ్మడి గల్ఫ్ సహకారం పై అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ చర్చలు
- రియల్ ఎస్టేట్ చట్టాల ఉల్లంఘన..డెవలపర్లకు భారీ ఫైన్
- అబుధాబిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
- ట్యాంక్బండ్ వద్ద భారీ కార్నివాల్