'అర్ధ శతాబ్దం' చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేసిన రానా
- July 05, 2020రిషిత శ్రీ క్రియేషన్స్ మరియు అక్కి ఆర్ట్స్..పతాకం పై.....
కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో, నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అర్ద శతాబ్ధం " రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం గ్లిమ్స్ ను హీరో రానా దగ్గుబాటి విడుదల చేశారు.
కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తిక్ రత్నం ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్పలో వెంకటేష్ కుమారుడిగా నటిస్తున్నాడు, అలాగే అర్థ శతాబ్దం సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదల చేసిన కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ లభించింది, దర్శకుడు రవీంద్ర ఏదయితే స్టోరీ నేరేట్ చేశాడో..దాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తారాగణం అంతా నటిస్తోన్న ఈ సినిమాకు సంభందించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ త్వరలో తెలుపనుంది.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్ , అక్కి ఆర్ట్స్
రచన,దర్శకత్వం: రవీంద్ర పుల్లే,
నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు,
సహా నిర్మాత : అక్కి
డిఓపి: అష్కర్ (బాయ్ ఫేమ్),
సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్)
ఆర్ట్: సుమిత్ పటేల్,
కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ
ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్,
పాటలు: రెహమాన్,
స్టాంట్స్: అంజి,
పిఆర్ఓ: సాయి సతీష్.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA