మస్కట్: ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్న షాపుల సీజ్
- July 10, 2020
కరోనా నేపథ్యంలో కొందరు వ్యాపారులు ప్రజల జేబులను కొల్లగొడుతున్నారు. అసలు ధరల కన్నా..రెట్టింపు ధరలకు సరుకులు అమ్ముతున్నారు. అలాంటి వారిపై వినియోగదారుల హక్కుల పరిరక్షణ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్ ప్రాంతంలోని బర్కలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎక్కువ ధరలకు సరుకులు అమ్ముతున్నట్లు తనిఖీల్లో రుజువు కావటంతో ఓ షాపును సీజ్ చేశారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు తాము చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామని, ఎవరైనా వ్యాపారులు ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకొని ప్రజలను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







