కువైట్:కొత్త వీసాల జారీ బంద్..వీసాల పొంది ఇంకా విదేశాల్లోనే ఉన్నవారి వీసాల రద్దు
- July 10, 2020
కువైటేజేషన్ లో భాగంగా జనాభా సమతుల్యతకు చర్యలు ప్రారంభించిన కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్త వీసాలను జారీ చేయటం లేదని ప్రకటించింది. అంతేకాదు..విమనాల రద్దుకు ముందు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. దీంతో లాక్ డౌన్ కు ముందు జారీ అయిన వర్క్ వీసా, విజిట్ వీసా, ఫ్యామిలీ వీసాలు రద్దు అయిపోయాయి. తదుపరి ప్రకటన వచ్చే వరకు కొత్త వీసాల జారీ ప్రస్తావనే ఉండదని, అసలు వీసా జారీ కేంద్రాలనే మూసివేస్తున్నట్లు కూడా కువైట్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో విదేశీయులకు ఇక కువైట్ వెళ్లే మార్గాలన్ని మూసుకుపోయినట్లే. ఇదిలాఉంటే వీసాలు పొంది ఇప్పటికే కువైట్ చేరుకున్న ప్రవాసీయులకు మాత్రం ఆగస్ట్ 31 వరకు పొడిగించింది. మరోవైపు నివాస అనుమతి రెన్యూవల్ విషయంలో మాత్రం ప్రవాసీయులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉండి సరైన పాస్ట్ పోర్టు ఉన్న ప్రవాసీయుల నివాస అనుమతిని రెన్యూవల్ చేయనున్నట్లు కువైట్ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వారికి ఫ్యామిలి వీసా, సెల్ఫ్ స్పాన్సర్ ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







