కువైట్:కొత్త వీసాల జారీ బంద్..వీసాల పొంది ఇంకా విదేశాల్లోనే ఉన్నవారి వీసాల రద్దు
- July 10, 2020
కువైటేజేషన్ లో భాగంగా జనాభా సమతుల్యతకు చర్యలు ప్రారంభించిన కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్త వీసాలను జారీ చేయటం లేదని ప్రకటించింది. అంతేకాదు..విమనాల రద్దుకు ముందు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది. దీంతో లాక్ డౌన్ కు ముందు జారీ అయిన వర్క్ వీసా, విజిట్ వీసా, ఫ్యామిలీ వీసాలు రద్దు అయిపోయాయి. తదుపరి ప్రకటన వచ్చే వరకు కొత్త వీసాల జారీ ప్రస్తావనే ఉండదని, అసలు వీసా జారీ కేంద్రాలనే మూసివేస్తున్నట్లు కూడా కువైట్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో విదేశీయులకు ఇక కువైట్ వెళ్లే మార్గాలన్ని మూసుకుపోయినట్లే. ఇదిలాఉంటే వీసాలు పొంది ఇప్పటికే కువైట్ చేరుకున్న ప్రవాసీయులకు మాత్రం ఆగస్ట్ 31 వరకు పొడిగించింది. మరోవైపు నివాస అనుమతి రెన్యూవల్ విషయంలో మాత్రం ప్రవాసీయులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉండి సరైన పాస్ట్ పోర్టు ఉన్న ప్రవాసీయుల నివాస అనుమతిని రెన్యూవల్ చేయనున్నట్లు కువైట్ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్న వారికి ఫ్యామిలి వీసా, సెల్ఫ్ స్పాన్సర్ ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









