వలసదారుల కోటా బిల్లుపై కువైట్తో భారత ప్రభుత్వం సంప్రదింపులు
- July 10, 2020
కువైట్ సిటీ:కువైట్ ఫారిన్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్కి భారత ప్రభుత్వం ‘వలసదారుల కోటా బిల్లు’ విషయమై తమ అభ్యంతరాల్ని వివరించడం జరిగింది. కువైట్తో భారత్కి సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఈ నేపథ్యంలో కువైట్కి తమ అభ్యంతరాల్ని తెలిపామని ఎంఈఏ అధికార ప్రతినిధి¸ అనురాగ్ శ్రీవాత్సవ చెప్పారు. వర్చువల్ ప్రెస్ బ్రీఫింగ్లో ఈ విషయాన్ని అనురాగ్ వెల్లడించారు. కువైట్ నేషనల్ అసెంబ్లీ లీగల్ మరియు లెజిస్లేటివ్ కమిటీ, వలసదారుల కోటా బిల్లుకి సంబంధించిన డ్రాఫ్ట్ని ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం సుమారు 8 లక్షల మంది భారతీయులు కువైట్ని వీడాల్సి వుంటుంది. కువైట్ జనాభాలో 15 శాతానికి మించి భారతీయులు వుండడానికి వీల్లేదన్నది ఈ బిల్లు సారాంశం. కువైట్లో భారతీయులు అత్యధిక శాతం మంది వున్నారు. కువైట్కి సంబంధించి 4.3 మిలియన్ల జనాభాలో భారతీయుల వాటా 1.45గా వుంది. మొత్తంగా వలసదారులు 3 మిలియన్లుగా వున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









