దుబాయ్ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైట్
- July 10, 2020
దుబాయ్:దుబాయ్ నుంచి విశాఖపట్నంకు గల్ఫ్ సేన జనసేన ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ ఫ్లైట్ 172 మందితో విశాఖపట్నం ఈ రోజు క్షేమంగా చేరుకుంది.ఈ ఫ్లైట్ ఏర్పాట్లకు అన్ని విధాలా సహకరించిన,ఇండిగో ఎయిర్లైన్స్ టీం కు,ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాన్సన్ కి సాట ట్రావెల్ ఏజెన్సీ కు,అలాగే APNRTS టీంకు కేసరి త్రిమూర్తులు ధన్యవాదాలు తెలిపారు.పవన్ కల్యాణ యొక్క సేవాదృక్పదంతో గల్ఫ్ లోని గర్భిణీ స్త్రీలు,ఉపాధి కోల్పోయిన వారు,హెల్త్ ఎమర్జెన్సీ వారికి హెల్ప్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో జనసేన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.అలాగే ఇండిగో ఎయిర్ లైన్స్ వారితో డైరెక్ట్ గా జనసేన టీం మాట్లాడం జరగడం వలన మనకు మార్కెట్ లో కంటే తక్కువ ధరకు టికెట్ దొరికింది.అలాగే గల్ఫ్ సేన జనసేన ఉచితంగా 10 టికెట్స్ మరియు 20 మందికి పూర్తిగా టికెట్ డబ్బులు కట్ట లేకపోయినా వారికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది.ఈ విమాన ఏర్పాట్లకు సహకరించిన జనసేన మెంబెర్స్ రాజు, గోపాల్,ప్రశాంతి,డాలీ, జాన్ బాబు,అప్పాజీ, స్వామి,శేఖర్ కు త్రిమూర్తులు ధన్యవాదాలు తెలిపారు.


తాజా వార్తలు
- దేశంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ప్రైవేట్ ట్రావెల్స్ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సమావేశం
- నకిలీ చాలెట్, హాలిడే హోమ్ అద్దె ఆఫర్లపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కువైట్ గగనతలంలో 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసిన సైన్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!









