షార్జా డిప్యూటీ రూలర్ ఆత్మశాంతికి అన్ని మసీదుల్లో ప్రార్ధనలు

- July 11, 2020 , by Maagulf
షార్జా డిప్యూటీ రూలర్ ఆత్మశాంతికి అన్ని మసీదుల్లో ప్రార్ధనలు

అనారోగ్యంతో గత గురువారం కన్నుమూసిన షార్జా డిప్యూటీ రూలర్ షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖసిమి ఆత్మశాంతి అన్ని మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ధుహర్ ప్రార్ధన ముగిసిన వెంటనే దివంగత డిప్యూటీ రూలర్ కోసం ప్రార్ధనలు నిర్వహించాలని షార్జా ఇస్లామిక్ వ్యవహారాల విభాగం ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చింది. ఆయన పట్ల భగవంతుడు దయ చూపాలని, ఆయన ఆత్మకు స్వర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ దేవుణ్ణి వేడుకోనున్నారు. షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అనారోగ్యంతో గత గురువారం యూకేలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com