ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- November 12, 2025
మస్కట్: ఒమన్ హాకీ5స్ ఈవెంట్ కు సర్వం సిద్ధమైంది. హాకీ ఒమన్ కార్నివాల్ లో ఐదు దేశాల నుండి 47 జట్లు మరియు 500 కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు. నవంబర్ 13 నుంచి15 వరకు అల్ అమెరాట్లోని హాకీ ఒమన్ అరీనాలో జరగనున్నది.
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. తొలిరోజు సాయంత్రం 5 గంటలకు ఫ్యాన్ విలేజ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు, వింటేజ్ కార్ల ప్రదర్శనలు హైలెట్ కానున్నాయి.. క్రీడను సమాజ వేడుకతో మిళితం చేస్తూ 600 మంది మహిళలతో కూడిన ప్రత్యేక నృత్య ప్రదర్శన కూడా జరుగుతుంది.
ఇండియా, ఈజిప్ట్, యూఏఈ, ఇరాక్ మరియు ఒమన్ దేశాల నుండి జట్లు పోటీపడుతున్నాయి. ఈ గేమ్స్ ద్వారా యువ ప్రతిభను మరియు అట్టడుగు స్థాయిలో హాకీని ప్రోత్సహించడం జరుగుతుందని ఒమన్ హాకీ అసోసియేషన్ చైర్మన్ మార్వాన్ జుమా అల్ జుమా తెలిపారు.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









