ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- November 12, 2025
మస్కట్: ఒమన్ హాకీ5స్ ఈవెంట్ కు సర్వం సిద్ధమైంది. హాకీ ఒమన్ కార్నివాల్ లో ఐదు దేశాల నుండి 47 జట్లు మరియు 500 కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు. నవంబర్ 13 నుంచి15 వరకు అల్ అమెరాట్లోని హాకీ ఒమన్ అరీనాలో జరగనున్నది.
ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచులు ప్రారంభమవుతాయి. తొలిరోజు సాయంత్రం 5 గంటలకు ఫ్యాన్ విలేజ్ లో సాంస్కృతిక ప్రదర్శనలు, వింటేజ్ కార్ల ప్రదర్శనలు హైలెట్ కానున్నాయి.. క్రీడను సమాజ వేడుకతో మిళితం చేస్తూ 600 మంది మహిళలతో కూడిన ప్రత్యేక నృత్య ప్రదర్శన కూడా జరుగుతుంది.
ఇండియా, ఈజిప్ట్, యూఏఈ, ఇరాక్ మరియు ఒమన్ దేశాల నుండి జట్లు పోటీపడుతున్నాయి. ఈ గేమ్స్ ద్వారా యువ ప్రతిభను మరియు అట్టడుగు స్థాయిలో హాకీని ప్రోత్సహించడం జరుగుతుందని ఒమన్ హాకీ అసోసియేషన్ చైర్మన్ మార్వాన్ జుమా అల్ జుమా తెలిపారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









