మస్కట్: సివిల్ స్టేటస్ ఆఫీస్ కు వెళ్లకుండానే ప్రవాసీయులకు రెసిడెన్సీ రెన్యూవల్స్
- July 11, 2020
మస్కట్:రెసిడెన్సీ కార్డుల రెన్యూవల్ చేసుకోవాలనుకుంటున్న ప్రవాసీయులు పాస్ పోర్ట్, సివిల్ స్టేటస్ డైరెక్టర్ జనరల్ ఆఫీసుకు రానవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రవాస ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వేలి ముద్రలు ఇప్పటికే సివిల్ స్టేటస్ ఆఫీసులో స్టోర్ అయి ఉన్నాయని..వాటి ఆధారంగా రెన్యూవల్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు..రెన్యూవల్ గడువు దాటిన వారికి జరిమానాల నుంచి జులై 15 వరకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం రెసిడెన్సీ కార్డు రెన్యూవల్ చేయాలనుకునే వారు ఎలాంటి ఫైన్లు చెల్లించాల్సిన అవసరం లేదని, అలాగే ఎలాంటి డాక్యుమెంట్లు ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదని కూడా సివిల్ స్టేటస్ కార్యాలయ అధికారులు వివరించారు. ఇదిలాఉంటే..పలు డాక్యుమెంట్ల జారీ కోసం అన్ని గవర్నరేట్లలోని స్థానిక పోలీస్ స్టేషన్లలోనే సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మస్కట్ విషయానికి వస్తే అల్ దఖిలియా గవర్నరేట్లోని అల్ హమ్రా పోలీస్ స్టేషన్, ధోఫర్ గవర్నరేట్లోని మార్ముల్ పోలీస్ స్టేషన్లతో పాటు కొత్తగా అల్ ఖౌద్, అల్ అమెరాట్, మాబెలా, ఖురియాత్ పోలీస్ స్టేషన్లలో సేవా కేంద్రాలను ప్రారంభించింది. ఈ సేవా కేంద్రాల్లో రాయల్ ఒమన్ పోలీస్ నుంచి జారీ చేయబడిన డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్లు, పాస్ పోర్ట్ రెన్యూవల్, ఐడీ/రెసిడెన్సీ కార్డులను కలెక్ట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- సహారా ఎడారిలో తీవ్ర విషాదం..నీళ్లు దొరక్క 49 మంది మృతి









