దుబాయ్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు

- July 12, 2020 , by Maagulf
దుబాయ్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు

దుబాయ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. షేక్ జయాద్ రోడ్డులో 14 సీటర్ మినీ బస్సు అదుపు తప్పి కుడి వైపు ఉన్న సిమెంట్ బ్యారియర్ ను ఢి కొట్టింది. దీంతో వాహనం బోల్తా పడటం, మంటలు చెలరేగటం క్షణాల్లోనే జరిగిపోయాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి పాట్రోలింగ్ వాహనాలను పంపించి సహాయక చర్యలను చేపట్టినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com