అబుదాబీ కార్మికుడికి 100,000 డాలర్ల ప్రైజ్మనీ
- February 03, 2016అబుదాబీలోని బంగ్లాదేశీ కార్మికుడికి ఊహించని విధంగా బంపర్ ప్రైజ్ దక్కింది. 32 ఏళ్ళ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్ సలాఉద్దీన్మొహమ్మద్ ఇషాక్ 100,000 (367,000 దిర్హామ్లు) ప్రైజ్ మనీ పొందాడు. యూఏఈ ఎక్స్ఛేంజ్ నిర్వహించిన 'సెండ్ మనీ - విన్ డాలర్స్' కాంటెస్ట్లో ఈ ప్రైజ్ మనీ అతనికి లభించింది. ప్రైజ్ మనీ లభించిందన్న విషయం తెలిసి తాను నమ్మలేకపోయాననీ, తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యానని విజేత ఇషాక్ చెప్పారు. 2015లో చాలాసార్లు డబ్బుని బంగ్లాదేశ్కి పంపాననీ, అయితే ఇలాంటి ప్రైజ్ మనీ తనకు దక్కుతుందని ఎప్పుడూ ఊహించలేకపోయానని ఆయన అన్నాడు. జనవరి 18, 21న తీసిన డ్రాలో విజేతల్ని ప్రకటించారు. ఇంకో ఐదుగురు విజేతలకు 10,000 డాలర్ల చొప్పున ఇవ్వనుండగా, 50 మందికి 1,000 డాలర్ల చొప్పున బహుమతి ఇవ్వనున్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి