భారత్ లో కరోనాతో ఒక్కరోజే 500 మంది మృతి
- July 13, 2020
భారత దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కరోనా మహమ్మారి కారణంగా గత వారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,78,254కు చేరింది.
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 3,01,609 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 5,53,471 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరోజే 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,174కు పెరిగింది. గత 24 గంటల్లో 18850 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







