భారత్ లో కరోనాతో ఒక్కరోజే 500 మంది మృతి
- July 13, 2020భారత దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కరోనా మహమ్మారి కారణంగా గత వారం రోజులుగా దేశంలో 25 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,78,254కు చేరింది.
ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 3,01,609 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 5,53,471 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఒక్కరోజే 500 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,174కు పెరిగింది. గత 24 గంటల్లో 18850 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ