యూఏఈ:గడువు ముగిసిన వీసాలపై స్పష్టత..
- July 13, 2020
యూఏఈ:వీసాల రెన్యూవల్పై కీలక ప్రకటన చేసిన యూఏఈ ప్రభుత్వం.వీసాల రెన్యూవల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో యూఏఈ.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్కు సంబంధించి మూడు నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ఆదేశించింది. ఈ క్రమంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ICA) జూలై 12 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్ కోసం ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. కార్యాలయాల్లో రద్దీ వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ICA పేర్కొంది.
ICA వెబ్సైటు లింకు https://www.ica.gov.ae
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







