యూఏఈ:గడువు ముగిసిన వీసాలపై స్పష్టత..
- July 13, 2020
యూఏఈ:వీసాల రెన్యూవల్పై కీలక ప్రకటన చేసిన యూఏఈ ప్రభుత్వం.వీసాల రెన్యూవల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో యూఏఈ.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్కు సంబంధించి మూడు నెలల గ్రేస్ పీరియడ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో గడువు ముగిసిన వీసాలను తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ ఆదేశించింది. ఈ క్రమంలో ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ICA) జూలై 12 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా.. వీసా, ఎమిరేట్స్ ఐడీ కార్డుల జారీ, రెన్యూవల్ కోసం ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. కార్యాలయాల్లో రద్దీ వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ICA పేర్కొంది.
ICA వెబ్సైటు లింకు https://www.ica.gov.ae
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









