అగ్ని ప్రమాదంలో వలస మహిళ మృతి
- July 13, 2020
మనామా:బహ్రెయిన్లో చోటు చేసుకున్న ఓ అగ్ని ప్రమాదం ఓ వలస మహిళను బలితీసుకుంది. ఓ ఇంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందుకోగానే, 9 వాహనాలతో సివిల్ డిఫెన్స్ టీవ్స్ు, సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. నార్తరన్ గవర్నరేట్లోని సనాబిస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 44 ఏళ్ళ మహిళ ప్రాణాలు కోల్పోగా 9 మందిని పోలీసులు రక్షించారు. వీరిలో ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి. మిగతావారికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. మహిళను ఆఫ్రికాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







