ఏ.పీలో కొత్తగా 2,592 కరోనా పాజిటివ్‌ కేసులు

- July 17, 2020 , by Maagulf
ఏ.పీలో కొత్తగా 2,592 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,592 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40,646కు చేరుకుంది.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 837 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,298 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు,కృష్ణాలో ఒక్కరు.. మొత్తం 42 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 534 మరణించారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com