భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి సంస్థగా ఎయిర్ఇండియా..
- February 04, 2016
భారత విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తమ ప్రయాణికులకు భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తోంది. ఎయిర్ఇండియా మెనూలో లంచ్, డిన్నర్ తాలి(అన్నం, పప్పు, కూరలు, పచ్చడి, పెరుగుతో కూడిన భోజనం)ను చేర్చింది. వీటితో పాటు మసాలాటీనీ అందించబోతోంది. మధ్యాహ్నభోజనం, డిన్నర్ తాలి, మసాలా టీలతో సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్ఇండియా గుర్తింపు పొందనుంది. ఈ సోమవారం నుంచి ఈ సేవలను ఎయిర్ ఇండియా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దిల్లీ-ముంబయి, ముంబయి-దిల్లీ విమానాల్లో ఈ సేవలు అందిస్తున్నామని.. త్వరలో ఇతర మెట్రో సెక్టార్ విమానాల్లో ఈ సేవలను ప్రవేశపెడతామని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









