భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి సంస్థగా ఎయిర్‌ఇండియా..

- February 04, 2016 , by Maagulf
భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి సంస్థగా ఎయిర్‌ఇండియా..

భారత విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియా తమ ప్రయాణికులకు భారతీయ సంప్రదాయ భోజనాన్ని అందిస్తోంది. ఎయిర్‌ఇండియా మెనూలో లంచ్‌, డిన్నర్‌ తాలి(అన్నం, పప్పు, కూరలు, పచ్చడి, పెరుగుతో కూడిన భోజనం)ను చేర్చింది. వీటితో పాటు మసాలాటీనీ అందించబోతోంది. మధ్యాహ్నభోజనం, డిన్నర్‌ తాలి, మసాలా టీలతో సంప్రదాయ భోజనాన్ని అందిస్తున్న తొలి విమానయాన సంస్థగా ఎయిర్‌ఇండియా గుర్తింపు పొందనుంది. ఈ సోమవారం నుంచి ఈ సేవలను ఎయిర్‌ ఇండియా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దిల్లీ-ముంబయి, ముంబయి-దిల్లీ విమానాల్లో ఈ సేవలు అందిస్తున్నామని.. త్వరలో ఇతర మెట్రో సెక్టార్‌ విమానాల్లో ఈ సేవలను ప్రవేశపెడతామని ఎయిర్‌ ఇండియా వెల్లడించింది. ఈ మేరకు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com