'రాయభారి' చేసేందుకు రెడి : వరుణ్ తేజ

- February 04, 2016 , by Maagulf
'రాయభారి' చేసేందుకు రెడి : వరుణ్ తేజ

కంచె చిత్రం తో మంచి హిట్ అందుకున్న వరుణ్ తేజ ఇటీవలే పురి జగాన్నాద్ దర్శకత్వంలో లోఫర్ చిత్రం చేసి మాస్ హీరోగా మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలోనే స్పై థ్రిల్లర్ 'రాయభారి' చేసేందుకు రెడి అయ్యాడు వరుణ్ . గూడా చారి నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ విదేశాలల్లో నే జరగనుంది. ఇందుకోసం దర్శకుడు క్రిష్ ఇప్పటికే జార్జియాకు వెళ్లి ఈ చిత్రానికి సూట్ అయ్యే లోకేషన్స్ ని ఫైనల్ చేశాడు. రాయిబారి చిత్రం కోసం విదేశాల్లో 50 రోజుల షెడ్యుల్ తో పాటు అక్కడే మంచులో స్కింగ్ యాక్షన్ ఎపిసోడ్ ను కూడా ప్లాన్ చేశాడు క్రిష్ . అయితే ఈ చిత్రం కథ ఆధారంగా ఇద్దరు హీరోయిన్ లు అవసరం ఉండడం తో మొదటి హీరోయిన్ గా కంచె ఫేమ్ ప్రగ్య జైస్వాల్ ను ఒక హీరోయిన్ గా దర్శకుడు ఎంపిక చేశాడు.రెండో హీరోయిన్ కోసం ప్రస్తుతం అన్వేషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రంలో నటించే రెండో హీరోయిన్ ఎవరనేదాన్ని అఫీషియల్ అనౌన్స్ చేస్తారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com