మనామా:రెస్టారెంట్లో పేలుడు..10 మందికి గాయాలు

- July 18, 2020 , by Maagulf
మనామా:రెస్టారెంట్లో పేలుడు..10 మందికి గాయాలు

మనామా:మనామా లోని ఓ రెస్టారెంట్లో పేలుడు సంభవించటంతో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్లలో ఇద్దరు బహ్రెయిన్ వ్యక్తులు ఉండగా..మిగిలిన ఎనిమిది మంది ఆసియా దేశాలకు చెందిన వారు. రెస్టారెంట్లో గ్యాస్ లీక్ అవటంతో బ్లాస్టింగ్ జరిగినట్లు సివిల్ డిఫెన్స్ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బహ్రెయిన్ తూర్పు ప్రాంతంలోని తుబ్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు తీవ్రతకు రెస్టారెంట్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com