దోహా లో అనారోగ్య కారణంగా మృతి చెందిన ఏ.పి వాసి
- July 18, 2020
#APNRTS #మరియు #వైఎస్ఆర్సీపీ #వారి #సహకారంతో #స్వస్థలానికి #మృతదేహం .
#వైఎస్ఆర్సీపీ #గల్ఫ్ #ప్రతినిధి #మండా #వర్జిల్ #బాబు #అందించిన #సమాచారం #ప్రకారం
దోహా:పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపర్రు గ్రామానికి చెందిన నల్లి రత్నరాజు( 51) అనారోగ్య కారణాల వలన 15 రోజుల క్రితం ఖతార్ లో మృతి చెందినారు.రత్నం రాజు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఖతార్ లోని APNRTS కో-ఆర్డినేటర్, మరియు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ ప్రతినిధి మండా వర్జిల్ బాబు ఖతార్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ధీరజ్, ICBF మెంబెర్ రజనీ మూర్తి తో మాట్లాడి ఎమిగ్రేషన్ మరియు పేపర్ వర్క్ పనులు పూర్తి చేయించారు.బాడి బాక్సు విమాన టికెట్ ఖర్చులు,రాయబార కార్యాలయం వారు సమకూర్చారు. నిన్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం ద్వారా, మృతదేహం హైదరాబాద్ కు పంపండం జరిగింది. ఖతార్ రాయబార కార్యాలయం వారికి మండా వర్జీల్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మృతుని స్వస్థలం చంద్రపర్రు గ్రామానికి బి.హెచ్ ఇలియాస్(APNRTS డైరెక్టర్) సహకారంతో, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించినారు.
మండా, వర్జిల్ బాబు మాట్లాడుతూ, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించిన మేడపాటి వెంకట్(APNRTS ఛైర్మన్),బి.హెచ్ ఇలియాస్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మృతదేహం స్వస్థలం చేరింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







