ఆన్ లైన్ మోసగాళ్ల పట్ల అప్రమత్తం..యూఏఈ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక

- July 22, 2020 , by Maagulf
ఆన్ లైన్ మోసగాళ్ల పట్ల అప్రమత్తం..యూఏఈ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక

యూఏఈ:బ్యాంకర్ల పేరుతో సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది. కరోనా కారణంగా ఇటీవల డిజిటల్ బ్యాంకింగ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయితే..ఇదే అదనుగా ఆన్ లైన్ మోసగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామంటూ ఖతాదారులను నమ్మించి వారి అకౌంట్ వివరాలు తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో యూఏఈ సెంట్రల్ బ్యాంక్ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆన్ లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తోంది. బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామంటూ ఎవరూ ఫోన్ చేసిన అకౌంట్ వివరాలు వెల్లడించొద్దని సూచించింది. అలాగే మేసేజ్ లు పంపించిన అనుమానిత లింకులు పంపించినా స్పందించొద్దని పేర్కొంది. యూఏఈలోని బ్యాంకులు తమ వినియోగదారుల సమాచారం కోరుతూ ఎవరికీ ఫోన్ లు చేయవని..ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరింది. సెంట్రల్ బ్యాంక్ పేరు, లోగోతో నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి కూడా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు అప్రమత్తం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com