యూఏఈ:ఎయిర్‌పోర్టులోనే అరైవల్‌ సందర్భంగా పీసీఆర్‌ టెస్టులు

- July 23, 2020 , by Maagulf
యూఏఈ:ఎయిర్‌పోర్టులోనే అరైవల్‌ సందర్భంగా పీసీఆర్‌ టెస్టులు

యూఏఈ:యూఏఈ, కరోనా వైరస్‌ పరీక్షల్ని, ఎయిర్‌ పోర్టుల్లో ఎరైవల్‌ వద్దనే తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని విమానాశ్రయాల ద్వారా వచ్చేవారందరికీ ఈ పరీక్షలు తప్పనిసరిగా చేస్తారు. ఈ మేరకు నేషనల్‌ క్రైసిస్‌ అండ్‌ ఎమర్జన్సీ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఓ ప్రకటన చేసింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 12 ఏళ్ళ లోపు చిన్న పిల్లలు, అలాగే డిసేబిలిటీస్‌తో బాధపడుతున్నవారికి మినహాయింపునిచ్చారు. ప్రయాణీకులు తమ వెంట కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకురావాలి. 72 గంటల ముందుగా ఈ సర్టిఫికెట్‌ తీసుకుని వుండాలి. ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల నుంచే ఈ సర్టిఫికెట్లను తీసుకోవాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com