యూ.ఏ.ఈలో సెప్టెంబర్ 19 నుంచి IPL ప్రారంభం
- July 24, 2020
న్యూ ఢిల్లీ:క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న IPL-2020 నిర్వహణకు సంబంధించి చైర్మన్ బ్రిజేష్ పాటిల్ పలు కీలక విషయాలను వెల్లడించారు.యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.మొత్తం 8 టీంలు లీగ్ బరిలో నిలుస్తాయని, నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ‘కరేబియన్లీగ్ సెప్టెంబర్ 10 ముగుస్తుంది. అలాగే ఇంగ్లండ్-ఆస్ట్రేలియా సిరీస్ అదే నెల 15న ముగియనుంది. ఈ మూడు దేశాల ఆటగాళ్లు వెసులుబాటుకు దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తాం’ అని పాటిల్ తెలిపారు.దీనిపై బీసీసీఐ గవర్నర్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.మొత్తం 51 రోజుల పాటు లీగ్ను నిర్వహించే విధంగా షెడ్యూల్ను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం అనంతరం బ్రిజేష్ పాటిల్ మీడియాతో మాట్లాడారు.
టీ-20 ప్రపంచ్ కప్ వాయిదా పడటంతో ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే భారత్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో విదేశాల్లో లీగ్ను నిర్వహించాలని భావించింది. దీనిలో భాగంగానే లీగ్ నిర్వహణకు యూఏఈ అనువైన ప్రదేశంగా గుర్తించింది.ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే రూ.4వేల కోట్ల వరకు నష్టం చవిచూడాల్సి వస్తుందని లెక్కలేసిన బీసీసీఐ.. ఐసీసీ నిర్ణయంతో ఆ సమయంలో లీగ్ను నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







