యూ.ఏ.ఈలో సెప్టెంబర్ 19 నుంచి IPL ప్రారంభం
- July 24, 2020
న్యూ ఢిల్లీ:క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న IPL-2020 నిర్వహణకు సంబంధించి చైర్మన్ బ్రిజేష్ పాటిల్ పలు కీలక విషయాలను వెల్లడించారు.యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు లీగ్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.మొత్తం 8 టీంలు లీగ్ బరిలో నిలుస్తాయని, నవంబర్ 8న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ‘కరేబియన్లీగ్ సెప్టెంబర్ 10 ముగుస్తుంది. అలాగే ఇంగ్లండ్-ఆస్ట్రేలియా సిరీస్ అదే నెల 15న ముగియనుంది. ఈ మూడు దేశాల ఆటగాళ్లు వెసులుబాటుకు దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తాం’ అని పాటిల్ తెలిపారు.దీనిపై బీసీసీఐ గవర్నర్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.మొత్తం 51 రోజుల పాటు లీగ్ను నిర్వహించే విధంగా షెడ్యూల్ను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశం అనంతరం బ్రిజేష్ పాటిల్ మీడియాతో మాట్లాడారు.
టీ-20 ప్రపంచ్ కప్ వాయిదా పడటంతో ఐపీఎల్ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే భారత్లో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో విదేశాల్లో లీగ్ను నిర్వహించాలని భావించింది. దీనిలో భాగంగానే లీగ్ నిర్వహణకు యూఏఈ అనువైన ప్రదేశంగా గుర్తించింది.ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించకపోతే రూ.4వేల కోట్ల వరకు నష్టం చవిచూడాల్సి వస్తుందని లెక్కలేసిన బీసీసీఐ.. ఐసీసీ నిర్ణయంతో ఆ సమయంలో లీగ్ను నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







