మొబైల్ పోన్ మాట్లాడుతూ డ్రైవింగ్: 1,86,000 మోటరిస్టులకి జరీమానా
- July 24, 2020
యూ.ఏ.ఈ:గడచిన రెండేళ్ళలో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినందుకుగాను 1,86,000 మందికి జరీమానా విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ట్రాఫిక్ ఆఫీసర్లు, వివిధ రోడ్లపై అమర్చిన కెమెరాల ద్వారా ఉల్లంఘనల్ని గుర్తించడం జరిగిందని చెప్పారు. 2018, 2019లలో ఈ కేసులు నమోదయ్యాయి. 2018లో 89,712 ఉల్లంఘనలు నమోదు కాగా, 2019లో 96,894 ఉల్లంఘనలు నమోదయ్యాయి.ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే 4 బ్లాక్ పాయింట్స్తోపాటు 800 దిర్హామ్ ల జరీమానా విధిస్తారు.ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల తీవ్రత చాలా ఎక్కువవుతోందనీ, ఈ నేపథ్యంలో అనేక అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







