భారత్:దేశీయ విమానాలపై నవంబర్ 24 వరకు ఆంక్షలు కొనసాగింపు
- July 24, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనావైరస్ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశీయ విమానాలపై ఆంక్షలను నవంబర్ 24 వరకు పొడిగించింది. ఈ సాయంత్రం విడుదల చేసిన నోటిఫికేషన్ లో కూడా దేశీయ విమాన ఛార్జీలపై గతంలో విధించిన నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 25 న దేశీయ విమానాలను నిలిపివేశారు. కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ పూరి ఈ నెల ప్రారంభంలో మాట్లాడుతూ దీపావళి నాటికి ప్రయాణించే దేశీయ విమానాల సంఖ్య 55 నుండి 60 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశీయ విమానయాన పరిశ్రమ వివిధ రంగాలకు ఛార్జీల పరిమితితో, పరిమిత సామర్థ్యంతో పనిచేస్తున్నందున ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?