కరోనా నుంచి కోలుకుంటున్న యూఏఈ...
- July 26, 2020
యూఏఈ: యూఏఈ క్రమంగా మహమ్మారి కరోనా నుంచి కోలుకుంటోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గడంతో పాటు రికవరీలు పెరుగుతున్నాయి.శనివారం కూడా 313 కొత్త కేసులు నమోదు కాగా... 393 రికవరీలు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 58,562 మంది ఈ వైరస్ బారిన పడితే... 51,628 మంది కోలుకుని ఆస్పత్రి డిశ్చార్జి అయ్యారని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 343 మంది మరణించారు.మరోవైపు కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు యూఏఈ ముమ్మరంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో 4.5 మిలియన్లకు పైగా కోవిడ్ టెస్టులు పూర్తి చేసింది.
అలాగే ఆగస్టు నెలాఖరు వరకు 6 మిలియన్ల కరోనా పరీక్షలు పూర్తి చేయాలని యూఏఈ ఆరోగ్యశాఖ నిర్ణయించుకుంది. అందుకే ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో కోవిడ్ టెస్టులు చేపడుతోంది.అంతేగాక వ్యాక్సిన్ ట్రయల్స్లోనూ మూడో దశకు చేరుకున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







