మారుతి దర్శకత్వంలో చెర్రీ
- February 05, 2016
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్న రామ్ చరణ్ తరువాత చేయబోయే సినిమాల మీద కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివ, సుకుమార్ లాంటి దర్శకులను లైన్ లో పెట్టిన చెర్రీ, ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో దర్శకుణ్ని చేర్చాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచే చిన్న దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్న మగధీరుడు ఇటీవల ఓ భారీ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.ఒకప్పుడు డబుల్ మీనింగ్ సినిమాలు మాత్రమే తీస్తాడన్న పేరున్న మారుతి, భలే భలే మగాడివోయ్ సక్సెస్ తో ఆ పేరు చెరిపేసుకున్నాడు. ముఖ్యంగా క్లీన్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ భారీ వసూళ్లను సాధించి మారుతిని స్టార్ డైరెక్టర్ ను చేసింది.దీంతో వెంకటేష్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు మారుతి.ప్రస్తుతం వెంకీ హీరోగా బాబు బంగారం సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి, ఆ సినిమా తరువాత రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా, మారుతికి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









