మారుతి దర్శకత్వంలో చెర్రీ
- February 05, 2016
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్న రామ్ చరణ్ తరువాత చేయబోయే సినిమాల మీద కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే కొరటాల శివ, సుకుమార్ లాంటి దర్శకులను లైన్ లో పెట్టిన చెర్రీ, ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో దర్శకుణ్ని చేర్చాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచే చిన్న దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్న మగధీరుడు ఇటీవల ఓ భారీ హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.ఒకప్పుడు డబుల్ మీనింగ్ సినిమాలు మాత్రమే తీస్తాడన్న పేరున్న మారుతి, భలే భలే మగాడివోయ్ సక్సెస్ తో ఆ పేరు చెరిపేసుకున్నాడు. ముఖ్యంగా క్లీన్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ భారీ వసూళ్లను సాధించి మారుతిని స్టార్ డైరెక్టర్ ను చేసింది.దీంతో వెంకటేష్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు మారుతి.ప్రస్తుతం వెంకీ హీరోగా బాబు బంగారం సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి, ఆ సినిమా తరువాత రామ్ చరణ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా, మారుతికి మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







