యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది: సురేష్ రైనా

- July 26, 2020 , by Maagulf
యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది: సురేష్ రైనా

యూఏఈ వేదికగా సెప్టెంబర్ లో జరగనున్న ఐపీఎల్ 2020 కోసం నెలరోజుల ముందే అక్కడికి వెళ్తాము అని చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) బాట్స్మెన్ సురేష్ రైనా తెలిపాడు. ఈ ఏడాది మార్చి 29 ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక తాజాగా ఐసీసీ 2020 టీ 20 ప్రపంచ కప్ వాయిదా పడటంతో ఆ విండోలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు జరగనుంది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆటగాళ్లు, అభిమానులు అందరూ పండుగ చేసుకుంటున్నారు. ఇక యూఏఈ లో జరగనున్న ఐపీఎల్ పై సురేష్ రైనా మాట్లాడుతూ... నేను 2014 లో అక్కడ ఆడిన అనుభవంతో చెప్తున్నా..యూఏఈ లో మ్యాచ్ లు ఆడటం చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడి లాగా ప్రతి మ్యాచ్ కు విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉందదు. కేవలం మూడు స్టేడియాల్లోనే అన్ని మ్యాచ్ లు జరుగుతాయి. కాబట్టి ఒక్క స్టేడియం నుండి మరొకదానికి బస్సు లోనే వెళ్లడం. అందువల్ల ఆటగాళ్లు అలసిపోరు. ఇక మేము నెల ముందు అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడికి పరిస్థితులను, వాతావరణాన్ని అలవాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com