తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా పాజిటివ్ కేసులు
- July 27, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.హైదరాబాద్ నగరంతో పాటుగా మిగతా జిల్లాల్లోనూ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజా హెల్త్ బులెటిన్ సమాచారం ప్రకారం, తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 55,532కి చేరింది. ఇందులో 12,955 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 42,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 8 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 471 కరోనా మరణాలు నమోదయ్యాయి.
ఇక ఇదిలా ఉంటె జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు చూసుకుంటే, ఆదిలాబాద్-28, భద్రాద్రి కొత్తగూడెం-10, GHMC-506, జగిత్యాల-18, జనగాం-10, భూపాలపల్లి-10, జోగులాంబ గద్వాల్-32, కామారెడ్డి-17, కరీంనగర్-91, ఖమ్మం-20, మహబూబ్ నగర్-8, మహబూబాబాద్-34, మంచిర్యాల-14, మెదక్-17, మేడ్చల్-86, ములుగు-12, నాగర్ కర్నూల్-19, నల్గొండ-28, నారాయణ్ పెట్-2, నిజామాబాద్-41, రాజన్న సిరిసిల్ల-19, రంగారెడ్డి-168, సంగారెడ్డి-98, సిద్ధిపేట -12, సూర్యాపేట-32, వికారాబాద్-2, వనపర్తి-9, వరంగల్ రూరల్-8, వరంగల్ అర్బన్-111, యాదాద్రి-11 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







