తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా పాజిటివ్ కేసులు

- July 27, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.హైదరాబాద్ నగరంతో పాటుగా మిగతా జిల్లాల్లోనూ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజా హెల్త్ బులెటిన్ సమాచారం ప్రకారం, తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో తెలంగాణలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 55,532కి చేరింది.  ఇందులో 12,955 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  42,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 8 కరోనా మరణాలు సంభవించాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 471 కరోనా మరణాలు నమోదయ్యాయి.  

ఇక ఇదిలా ఉంటె జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు చూసుకుంటే, ఆదిలాబాద్-28, భద్రాద్రి కొత్తగూడెం-10, GHMC-506, జగిత్యాల-18, జనగాం-10, భూపాలపల్లి-10, జోగులాంబ గద్వాల్-32, కామారెడ్డి-17, కరీంనగర్-91, ఖమ్మం-20, మహబూబ్ నగర్-8, మహబూబాబాద్-34, మంచిర్యాల-14, మెదక్-17, మేడ్చల్-86, ములుగు-12, నాగర్ కర్నూల్-19, నల్గొండ-28, నారాయణ్ పెట్-2, నిజామాబాద్-41, రాజన్న సిరిసిల్ల-19, రంగారెడ్డి-168, సంగారెడ్డి-98, సిద్ధిపేట -12, సూర్యాపేట-32, వికారాబాద్-2, వనపర్తి-9, వరంగల్ రూరల్-8, వరంగల్ అర్బన్-111, యాదాద్రి-11 కేసులు నమోదయ్యాయి.  

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com