ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు..

- July 30, 2020 , by Maagulf
ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా  పాజిటివ్ కేసులు..

అమరావతి:ఏపీ‌లో గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,167 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,30,557కి పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 68గా ఉంది. దీంతో కలిపి మొత్తం ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1281కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా-9, గుంటూరు జిల్లా-9, అనంతపురం-8, కర్నూలు-8, విశాఖపట్నం-8, చిత్తూరు-6, కడప-6, ప్రకాశం- 4, విజయనగరం-4, కృష్ణా-3, నెల్లూరు-1, శ్రీకాకుళం-1 పశ్చిమ గోదావరి-1 కరోనాతో మరణించారు.

ఏపీలోని మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1441, కర్నూలులో 1252, విశాఖపట్నంలో 1223 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరిలో 998, అనంతపురంలో 954, గుంటూరులో 946, కడపలో 753, నెల్లూరులో 702, శ్రీకాకుళంలో 586, చిత్తూరులో 509, ప్రకాశంలో 318, కృష్ణాలో 271, విజయనగరంలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com