ఏపీలో మళ్లీ 10వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు..
- July 30, 2020
అమరావతి:ఏపీలో గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,167 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,30,557కి పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 68గా ఉంది. దీంతో కలిపి మొత్తం ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1281కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా-9, గుంటూరు జిల్లా-9, అనంతపురం-8, కర్నూలు-8, విశాఖపట్నం-8, చిత్తూరు-6, కడప-6, ప్రకాశం- 4, విజయనగరం-4, కృష్ణా-3, నెల్లూరు-1, శ్రీకాకుళం-1 పశ్చిమ గోదావరి-1 కరోనాతో మరణించారు.
ఏపీలోని మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1441, కర్నూలులో 1252, విశాఖపట్నంలో 1223 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ గోదావరిలో 998, అనంతపురంలో 954, గుంటూరులో 946, కడపలో 753, నెల్లూరులో 702, శ్రీకాకుళంలో 586, చిత్తూరులో 509, ప్రకాశంలో 318, కృష్ణాలో 271, విజయనగరంలో 214 కరోనా కేసులు నమోదయ్యాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?