హర్మేనియన్ ట్రెయిన్ సర్వీసుల పునఃప్రారంభానికి కౌంట్డౌన్
- July 30, 2020
జెడ్డా: హర్మేనియన్ హై స్పీడ్ ట్రెయిన్ సర్వీసు పునఃప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మక్కా మరియు మదీనా మధ్య జెడ్డా మీదుగా అలాగే కింగ్ అబ్దుల్లా ఎకనమిక్ సిటీ ఆఫ్ రబిగ్ మీదుగా వెళ్ళే ఈ రైలు సర్వీసు సెప్టెంబర్ నుంచి మళ్ళీ అందుబాటులోకి రానుంది. ఈ ట్రెయిన్కి సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. అల్ హర్మేనియన్ రైల్వే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియలో రిజర్వేషన్లు చేసుకోవచ్చు. గత డిసెంబర్లో ఈ రైలు సర్వీసుని నిలిపివేశారు. జెడ్డాలోని సులేమానియా స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో దీన్ని ఆపేశారు. ఆ తర్వాత కరోనా వైరస్ నేపథ్యంలో సర్వీసుల్ని ఆపేయాల్సి వచ్చింది. సర్వీసు రద్దు సమయంలో ప్రత్యేక మెయిన్టెనెన్స్ చర్యలు చేపట్టారు. మక్కా - మదీనా మధ్య రోజూ 12 ట్రిప్లు నడిచేవి.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







