ఆగస్టు 31 వరకూ భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య విమానాల రద్దు-DGCA

- July 31, 2020 , by Maagulf
ఆగస్టు 31 వరకూ భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య విమానాల రద్దు-DGCA

న్యూ ఢిల్లీ:ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాలను భారత్ నిషేధించింది. COVID-19 మహమ్మారి కారణంగా మార్చి 23 నుండి దేశం ఈ విమాన కార్యకలాపాలను నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా అంతర్జాతీయ కార్గో కార్యకలాపాలు, అలాగే DGCA ఆమోదించిన విమానాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ నిషేధం వ‌ర్తించ‌ద‌ని DGCA వెల్లడించింది. మార్చి 23 నుండి షెడ్యూల్ చేయబడిన వాణిజ్య విమానాలను నిషేధించగా, స్వదేశానికి తిరిగి వచ్చే విమానాల ప్రయాణాన్ని భారతదేశం అనుమతించింది. అలాగే గమ్యస్థాన దేశాల అవసరాలను తీర్చిన వారికి రవాణా విమానాల ద్వారా ప్రయాణించడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పటివరకు, భారతీయులను స్వదేశానికి రప్పించడానికి ఉద్దేశించిన వందే భారత్ మిషన్ కింద, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు 2,67,436 మంది ప్రయాణికులను చేర్చాయి మరియు ఇతర చార్టర్లు మే 6 నుండి జూలై 30 వరకు 4,86,811 మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చాయి.

అయితే అదనంగా, భారతదేశం ఇప్పటికే యుఎస్, ఫ్రాన్స్, జర్మనీ మరియు కువైట్లతో రవాణా ఒప్పందాలపై సంతకం చేసింది. వివిధ దేశాల నుండి ప్రయాణీకుల కదలికను సులభతరం చేయడానికి మరిన్ని రవాణా ఒప్పందాలు చేసుకునే పనిలో పడ్డాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com