మస్కట్:ఈద్ పేరుతో సామూహిక కార్యక్రమాలు నిర్వహిస్తే భారీ జరిమానాలు
- July 31, 2020
మస్కట్:ఈద్ సందర్భంగా ఎవరైనా ఒకే చోట గుమికూడితే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుందని రాయల్ ఒమన్ పోలీసులు హెచ్చరించారు. ఈద్ ను పురస్కరించుకొని ఎవరూ ఇతరులకు అహ్వానాలు పంపించొద్దని, అహ్వానాలు అందినా..ఎవరూ వెళ్లకూడదని కూడా పోలీసులు సూచించారు. ఒకవేళ తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఒకే దగ్గర గుమికూడితే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుందన్నారు. సామూహిక కార్యక్రమాలకు హజరైన ఒక్కో వ్యక్తిపై 1500 ఒమనీ రియాల్స్ ఫైన్ విధిస్తామన్నారు. ఎంతమంది వ్యక్తులు ఉంటే అన్ని 1500 ఒమనీ రియాల్స్ ను అహ్వానించిన వ్యక్తి చెల్లించాల్సి ఉంటుంది. ఇక హజరైన వ్యక్తిపై విడిగా మరో 1000 ఓమనీ రియాల్స్ ఫైన్ విధిస్తామని రాయల్ ఒమనీ పోలీసులు హెచ్చరించారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







