సాయంత్రానికల్లా కమర్షియల్ స్టోర్స్ మూసివేయాలి..మస్కట్ మున్సిపాలిటి హెచ్చరిక

- August 02, 2020 , by Maagulf
సాయంత్రానికల్లా కమర్షియల్ స్టోర్స్ మూసివేయాలి..మస్కట్ మున్సిపాలిటి హెచ్చరిక

మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో రాత్రిళ్లు జనసంచారంపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసే దిశగా మస్కట్ మున్సిపాలిటి తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటి పరిధిలోని అన్ని వాణిజ్య కేంద్రాలు సాయంత్రం వేళ త్వరగా మూసివేయాలని ఆదేశించింది. రాత్రి జనసంచారంపై నిషేధం కొనసాగుతుండటంతో ప్రజలు అంతా 7 గంటల వరకల్లా తమ తమ ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకునేలా అన్ని వాణిజ్య కేంద్రాలు సాయంత్రం త్వరగా మూసివేయాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపాలిటి అధికారులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com