అనుమతి లేకుండా హజ్ యాత్ర..ఏడుగురి అరెస్ట్..ఇద్దరిపై బహిష్కరణ వేటు
- August 02, 2020
రియాద్:హజ్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భక్తులను తరలిస్తున్న ఏడుగురికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ ఏడాది హజ్ యాత్రపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏడుగురు వ్యక్తులు భక్తులను అక్రమంగా తరలిస్తూ భద్రత బలగాల సోదాల్లో పట్టుబడ్డారు. మొత్తం 17 మంది భక్తులను అనుమతి లేకుండా పవిత్ర ప్రార్ధనా మందిర ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వారికి 105 రోజుల జైలు శిక్షతో పాటు SR170,000ల భారీ జరిమానా విధించారు. పట్టుబడిన వారిలో ఇద్దరు ప్రవాసీయులు కూడా ఉండటంతో వారిపై దేశబహిష్కణ వేటు పడింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?