అనుమతి లేకుండా హజ్ యాత్ర..ఏడుగురి అరెస్ట్..ఇద్దరిపై బహిష్కరణ వేటు
- August 02, 2020
రియాద్:హజ్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భక్తులను తరలిస్తున్న ఏడుగురికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ ఏడాది హజ్ యాత్రపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏడుగురు వ్యక్తులు భక్తులను అక్రమంగా తరలిస్తూ భద్రత బలగాల సోదాల్లో పట్టుబడ్డారు. మొత్తం 17 మంది భక్తులను అనుమతి లేకుండా పవిత్ర ప్రార్ధనా మందిర ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వారికి 105 రోజుల జైలు శిక్షతో పాటు SR170,000ల భారీ జరిమానా విధించారు. పట్టుబడిన వారిలో ఇద్దరు ప్రవాసీయులు కూడా ఉండటంతో వారిపై దేశబహిష్కణ వేటు పడింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







