అనుమతి లేకుండా హజ్ యాత్ర..ఏడుగురి అరెస్ట్..ఇద్దరిపై బహిష్కరణ వేటు
- August 02, 2020
రియాద్:హజ్ అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భక్తులను తరలిస్తున్న ఏడుగురికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ ఏడాది హజ్ యాత్రపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏడుగురు వ్యక్తులు భక్తులను అక్రమంగా తరలిస్తూ భద్రత బలగాల సోదాల్లో పట్టుబడ్డారు. మొత్తం 17 మంది భక్తులను అనుమతి లేకుండా పవిత్ర ప్రార్ధనా మందిర ప్రాంతాలకు చేరవేసే ప్రయత్నం చేసినట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన వారికి 105 రోజుల జైలు శిక్షతో పాటు SR170,000ల భారీ జరిమానా విధించారు. పట్టుబడిన వారిలో ఇద్దరు ప్రవాసీయులు కూడా ఉండటంతో వారిపై దేశబహిష్కణ వేటు పడింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







