కువైట్ నుంచి వెళ్లిపోయిన 2 లక్షల మంది ప్రవాసీయులు
- August 05, 2020కువైట్ సిటీ:కువైటేజేషన్ నేపథ్యంలో కువైట్ నుంచి ప్రవాసీయులు భారీగా వారీ సొంత దేశాలకు తరలివేళ్తున్నారు. మార్చి 16 నుంచి జులై 31 వరకు దాదాపు 2,03,967 మంది కువైట్ విడిచి వెళ్లినట్లు డీజీసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఆరోగ్యభద్రతకు అన్ని ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆగస్ట్ 1 నుంచి కువైట్ నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరించారు. దీంతో ఆగస్ట్ 1 నుంచి రెండు రోజుల వ్యవధిలో 4,271 మంది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు నిర్వహించారు. విమాన సర్వీసులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని డీజీసీఏ ఆపరేషన్ డైరెక్టర్ తెలిపారు. అయితే..కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే మంత్రిమండలి నిర్ణయం విమాన సర్వీసులను పునరుద్ధరణ తొలిదశలో భాగంగా పస్తుత విమాన సర్వీసులను నడుపుతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు