కువైట్ నుంచి వెళ్లిపోయిన 2 లక్షల మంది ప్రవాసీయులు

- August 05, 2020 , by Maagulf
కువైట్ నుంచి వెళ్లిపోయిన 2 లక్షల మంది ప్రవాసీయులు

కువైట్ సిటీ:కువైటేజేషన్ నేపథ్యంలో కువైట్ నుంచి ప్రవాసీయులు భారీగా వారీ సొంత దేశాలకు తరలివేళ్తున్నారు. మార్చి 16 నుంచి జులై 31 వరకు దాదాపు 2,03,967 మంది కువైట్ విడిచి వెళ్లినట్లు డీజీసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఆరోగ్యభద్రతకు అన్ని ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆగస్ట్ 1 నుంచి కువైట్ నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరించారు. దీంతో ఆగస్ట్ 1 నుంచి రెండు రోజుల వ్యవధిలో 4,271 మంది కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు నిర్వహించారు. విమాన సర్వీసులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని డీజీసీఏ ఆపరేషన్ డైరెక్టర్ తెలిపారు. అయితే..కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే మంత్రిమండలి నిర్ణయం విమాన సర్వీసులను పునరుద్ధరణ తొలిదశలో భాగంగా పస్తుత విమాన సర్వీసులను నడుపుతున్నట్లు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com