దుబాయ్ పోలీసుల దాతృత్వం..సొంత ఖర్చులతో స్వదేశాలకు 1,145 ఖైదీల తరలింపు
- August 05, 2020
దుబాయ్:వివిధ నేరాల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న ఖైదీల పట్ల దుబాయ్ పోలీసులు దాతృత్వం ప్రదర్శించారు. తొలి అర్ధ వార్షికంలో దాదాపు 1,145 మందిని వారి సొంత దేశాలకు తరలించేందుకు విమాన టికెట్ల ఖర్చులను పోలీసులు భరించారు. పలువురు దాతల సహకారంతో Dhs1,479,010 సేకరించి ఖైదీలకు పైసా ఖర్చు లేకుండా విమాన టికెట్లను ఏర్పాటు చేశారు. దుబాయ్ పోలీసుల చొరవతో సొంత దేశాలకు వెళ్లిన 1,145 మందిలో పురుషులు, మహిళలు కూడా ఉన్నారు. ప్రతి మనిషి పరివర్తన చెందిన చెందేందుకు మరో అవకాశం కల్పించాలని అందులోభాగంగానే శిక్షాకాలం పూర్తి చేసుకున్నవారికి తమ వంతుగా తోచిన సాయం అందిస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం దాతలు కూడా సహకరిస్తున్నారని వెల్లడించారు. అంతేకాదు..తమకు పలువురి నుంచి అందుతున్న ఆర్ధిక సహాకరంతో అవసరమైన వారికి అహార సామాగ్రి సమకూర్చటం, రెసిడెన్షియల్ ఛార్జీలు భరించటం, వైద్య పరికరాలు, బ్లడ్ మనీ నిర్వహణతో పాటు విద్యార్ధులకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్యూషన్ ఫీజులు చెల్లించటం, స్కూలు బ్యాగుల పంపిణీ, ఈద్ సందర్భంగా బట్టల పంపిణీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మానవీయ కోణంలోనే ప్రతి ఏడాది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







