దుబాయ్ పోలీసుల దాతృత్వం..సొంత ఖర్చులతో స్వదేశాలకు 1,145 ఖైదీల తరలింపు
- August 05, 2020
దుబాయ్:వివిధ నేరాల శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న ఖైదీల పట్ల దుబాయ్ పోలీసులు దాతృత్వం ప్రదర్శించారు. తొలి అర్ధ వార్షికంలో దాదాపు 1,145 మందిని వారి సొంత దేశాలకు తరలించేందుకు విమాన టికెట్ల ఖర్చులను పోలీసులు భరించారు. పలువురు దాతల సహకారంతో Dhs1,479,010 సేకరించి ఖైదీలకు పైసా ఖర్చు లేకుండా విమాన టికెట్లను ఏర్పాటు చేశారు. దుబాయ్ పోలీసుల చొరవతో సొంత దేశాలకు వెళ్లిన 1,145 మందిలో పురుషులు, మహిళలు కూడా ఉన్నారు. ప్రతి మనిషి పరివర్తన చెందిన చెందేందుకు మరో అవకాశం కల్పించాలని అందులోభాగంగానే శిక్షాకాలం పూర్తి చేసుకున్నవారికి తమ వంతుగా తోచిన సాయం అందిస్తున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం దాతలు కూడా సహకరిస్తున్నారని వెల్లడించారు. అంతేకాదు..తమకు పలువురి నుంచి అందుతున్న ఆర్ధిక సహాకరంతో అవసరమైన వారికి అహార సామాగ్రి సమకూర్చటం, రెసిడెన్షియల్ ఛార్జీలు భరించటం, వైద్య పరికరాలు, బ్లడ్ మనీ నిర్వహణతో పాటు విద్యార్ధులకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్యూషన్ ఫీజులు చెల్లించటం, స్కూలు బ్యాగుల పంపిణీ, ఈద్ సందర్భంగా బట్టల పంపిణీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. మానవీయ కోణంలోనే ప్రతి ఏడాది స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!