31 దేశాల ప్రయాణికులపై నిషేధాన్ని ప్రతి 10 రోజులకు సమీక్షించనున్న కువైట్
- August 06, 2020కువైట్ సిటీ:కరోనా ప్రభావంతో 31 దేశాల ప్రయాణిలపై నిషేధం విధించిన కువైట్ ప్రభుత్వం..తమ నిషేధ నిర్ణయంపై ప్రతి 10 రోజులకు ఓ సారి సమీక్షిస్తామని వెల్లడించింది. ఆయా దేశాల్లో కరోనా తీవ్రత, అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల ఆధారంగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే నివేదికలను బట్టి నిషేధం సడిలింపులపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతర్జాతీయ సంస్థల నివేదిక ఆధారంగా నిషేధం విధించిన 31 దేశాల జాబితాను పెంచనూ వచ్చు..లేదంటే తగ్గించనూ వచ్చని కువైట్ వెల్లడించింది. అయితే..ఏయే దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించాలనేది నిర్ణయించేందుకు ఓ యంత్రగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. జడ్జిలు, డాక్టర్లు, నర్సులు, టీచర్లకు ప్రధాన్యత ఉంటుంది. ఇదిలాఉంటే..కువైట్ నుంచి భారత్ కు వెళ్లే ప్రయాణికులు అనుమతి ఇచ్చేలా ఇరుదేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించారు. ఈ మేరకు రోజు వెయ్యి మంది ప్రయాణికులు కువైట్ నుంచి భారత్ కు ప్రయాణించొచ్చు. అయితే..ప్రస్తుత నిబంధనల ప్రకారం మాత్రం కువైట్-భారత్ మధ్య విమాన ప్రయాణంపై నిషేధం అమలులో ఉంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం