తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదు

- August 08, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు రోజురోజు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. అటు, కొత్తగా 14మంది కరోనాతో మరణాలు సంభవించాయి. తాజాగా నమోదైన మరణాలతో.. కరోనా మృతుల సంఖ్య 615కు చేరుకుంది. ఇప్పటివరకూ 54,330 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 22,568 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో 5,90,306 కరోనా టెస్టులు నిర్వహించారు.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com