కువైట్:ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత చర్చిలో మళ్లీ సామూహిక ప్రార్ధనలు

- August 08, 2020 , by Maagulf
కువైట్:ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత చర్చిలో మళ్లీ సామూహిక ప్రార్ధనలు

కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో నెలల తరబడి ప్రార్ధనా మందిరాల్లో నిలిచిపోయిన సాముహిక ప్రార్థనలు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. కువైట్ లోని బిషప్ క్యాథలిక్ చర్చిలో దాదాపు 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత నిన్న సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మాస్ పునప్రారంభమైన రోజునే పది మాసెస్ నిర్వహించారు. అయితే..సామూహిక ప్రార్థనలను నిర్వహించినా..కరోనా వ్యాప్తి నియంత్రణ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. చర్చీకి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఖచ్చితంగా భౌతిక దూరం పాటించటంతో పాటు మాస్కులు, గ్లౌజులు ఉంటేనే చర్చీలోకి అనుమతించారు. ఎవరైనా భక్తులు మాస్ లో పాల్గొనాలని కోరుకుంటే ముందస్తుగా www.avona.orgలో వారి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలోనే అనుమతి ఉంటుంది కనుక విడతల వారీగా మస్ కు అనుమతిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com