కువైట్:ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత చర్చిలో మళ్లీ సామూహిక ప్రార్ధనలు
- August 08, 2020
కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో నెలల తరబడి ప్రార్ధనా మందిరాల్లో నిలిచిపోయిన సాముహిక ప్రార్థనలు ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి. కువైట్ లోని బిషప్ క్యాథలిక్ చర్చిలో దాదాపు 5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత నిన్న సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మాస్ పునప్రారంభమైన రోజునే పది మాసెస్ నిర్వహించారు. అయితే..సామూహిక ప్రార్థనలను నిర్వహించినా..కరోనా వ్యాప్తి నియంత్రణ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. చర్చీకి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతి ఇస్తున్నారు. ఖచ్చితంగా భౌతిక దూరం పాటించటంతో పాటు మాస్కులు, గ్లౌజులు ఉంటేనే చర్చీలోకి అనుమతించారు. ఎవరైనా భక్తులు మాస్ లో పాల్గొనాలని కోరుకుంటే ముందస్తుగా www.avona.orgలో వారి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పరిమిత సంఖ్యలోనే అనుమతి ఉంటుంది కనుక విడతల వారీగా మస్ కు అనుమతిస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







