లెబనాన్ ఘటనలో 149కి చేరిన మృతుల సంఖ్య

- August 08, 2020 , by Maagulf
లెబనాన్ ఘటనలో 149కి చేరిన మృతుల సంఖ్య

బీరుట్:లెబనాన్ రాజధాని బీరుట్‌లో జరిగిన ప్రమాదంలో మృతదేహాలు ఇంకా పెరుగుతున్నాయి. బీరూట్‌లోని ఓడరేవుల వద్ద చోటుచేసుకున్న భారీ పేలుళ్ల వల్ల కూలిని భవనాల శిథిలాల నుంచి మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య 149కి చేరింది. వేలు మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. ఇంకా శిథిలాల క్రింద మృత దేహాల కోసం వెతుకుతున్నారు. భారీ ఎత్తున పేలుడు సంభవించడంతో వేలమందికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో ఆస్పత్రలు కూడా దెబ్బతినడంతో రోగులకు చికిత్స అందించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com