దుబాయ్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై కరోనా ఎఫెక్ట్..ఆన్ లైన్ లోనే వీక్షణ
- August 10, 2020
దుబాయ్: కరోనా నేపథ్యంలో దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 15న దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ లో వేడుక జరుగుతుందని, కానీ, వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇండియన్ కాన్సులేట్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కు ప్రవాసభారతీయులు, భారత శ్రేయోభిలాషులు ను రావద్దని కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
74వ భారత్ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ కాన్సుల్ జనరల్ డా.అమన్ పూరి, ఆగస్ట్ 15న ఉదయం 7:30కు జండా వందనం కావించి భారత రాష్ట్రపతి యొక్క సందేశాన్ని చదువుతారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు కాన్సులేట్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు కేవలం ఇండియన్ కాన్సులేట్ అధికారులు మాత్రమే హాజరవ్వనున్నారు. ప్రస్తుత కరోనా మహమ్మారి ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ వేడుకలకు అనుమతించబడరు, అయితే..ఆన్ లైన్ ద్వారా త్రివర్ణ పతాకావిష్కరణ, కార్యాలయం ప్రసంగాలను ప్రత్యక్షంగా వీక్షిండేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని కాన్సులేట్ స్పష్టం చేసింది.
ఫెస్బుక్ లో వీక్షించేందుకు: @IndianConsulate.Dubai
ట్విట్టర్ లో వీక్షించేందుకు: @cgidubai
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!