మస్కట్ ఫెస్టివల్లో పసిపిల్లలతో జాగ్రత్త
- February 06, 2016
మస్కట్ ఫెస్టివల్కి విచ్చేసే విజిటర్స్ తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఫెస్టివల్ని సందర్శించే క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అశ్రద్ధ చేస్తున్నారనీ, తద్వారా పిల్లలు తప్పి పోతున్నారనీ, ఫెస్టివల్ నిర్వాహకులు అలాంటి పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ, పది మంది పిల్లల కంటే ఎక్కువమంది తప్పిపోయిన సందర్భాల్లో వారిని ఎక్కువసేపు మేనేజ్ చేయడం కష్టమవుతోందని పోలీసు అధికారులు చెప్పారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించి వెంటనే తల్లిదండ్రులు, ఫెస్టివల్ నిర్వాహకుల్ని సంప్రదిస్తే పట్టుకోవడం తేలికవుతుందని వివరించారు. పిల్లలకు తగిన ఆహారం ఇచ్చినా, ధైర్యం చెప్పినా తల్లిదండ్రుల కోసం ఏడుస్తుంటారని నిర్వాహకులు తెలిపారు. వీకెండ్స్లో ఒక్కోసారి 60 మంది పిల్లల వరకు తప్పిపోయిన ఘటనలు ఉంటున్నాయని పోలీసులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు మస్కట్ ఫెస్టివల్ నిర్వహించబడుతోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









