మస్కట్ ఫెస్టివల్లో పసిపిల్లలతో జాగ్రత్త
- February 06, 2016
మస్కట్ ఫెస్టివల్కి విచ్చేసే విజిటర్స్ తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఫెస్టివల్ని సందర్శించే క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అశ్రద్ధ చేస్తున్నారనీ, తద్వారా పిల్లలు తప్పి పోతున్నారనీ, ఫెస్టివల్ నిర్వాహకులు అలాంటి పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ, పది మంది పిల్లల కంటే ఎక్కువమంది తప్పిపోయిన సందర్భాల్లో వారిని ఎక్కువసేపు మేనేజ్ చేయడం కష్టమవుతోందని పోలీసు అధికారులు చెప్పారు. తప్పిపోయిన పిల్లలకు సంబంధించి వెంటనే తల్లిదండ్రులు, ఫెస్టివల్ నిర్వాహకుల్ని సంప్రదిస్తే పట్టుకోవడం తేలికవుతుందని వివరించారు. పిల్లలకు తగిన ఆహారం ఇచ్చినా, ధైర్యం చెప్పినా తల్లిదండ్రుల కోసం ఏడుస్తుంటారని నిర్వాహకులు తెలిపారు. వీకెండ్స్లో ఒక్కోసారి 60 మంది పిల్లల వరకు తప్పిపోయిన ఘటనలు ఉంటున్నాయని పోలీసులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 13 వరకు మస్కట్ ఫెస్టివల్ నిర్వహించబడుతోంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







