డ్రగ్స్ ముఠా ఆట కట్టించిన సౌదీ పోలీసులు..107 కిలోల మత్తుపదార్ధాల స్వాధీనం
- August 13, 2020
రియాద్:సౌదీలో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు జాసన్ పోలీసులు. ఓ వాహనంలో తరలిస్తున్న మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలోని ట్రంక్ ప్రాంతంలో నిషేధిత హషిష్ ను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు స్మగ్లర్లు కుట్ర చేశారు. అయితే..వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు..డ్రగ్స్ తరలిస్తున్న వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించటంతో అసలు బాగోతం బయటపడింది. ఏకంగా 107 కేజీల నిషేధిత హషిష్ ను గుర్తించిన పోలీసులు..మత్తు పదార్ధాలను సీజ్ చేశారు. సౌదీ చెందిన వ్యక్తి వాహనం నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రగ్స్ తరలిస్తున్న తీరును బట్టి ఇది పక్కా స్మగ్లింగ్ గ్యాంగ్ పనే అని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. సౌదీ చట్టాల మేరకు మత్తుపదార్ధాలు సరఫరాపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!