కువైట్: కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉంటేనే కొత్త వీసాల జారీ
- August 14, 2020వివిధ దేశాల నుంచి కువైట్ రావాలనుకుంటున్న వారికి కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల కొత్త వీసాల జారీని నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే..కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉన్న వారికి మాత్రమే వీసాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఇక నుంచి కువైట్ రావాలనుకునే వాళ్లంతా తప్పనిసరిగా కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటిని ముందుకు సంప్రదించాల్సి ఉంటుంది. కమిటీ దరఖాస్తుదారులకు అనుమతి ఇచ్చిన తర్వాతే కొత్త వీసా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే లాక్ డౌన్ నుంచి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా కువైట్ వచ్చే మంగళవారం నుంచి నాలుగో దశ అన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే..పాక్షిక కర్ఫ్యూ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు