దుబాయ్ తిరిగి వచ్చే ప్రవాసీయులకు ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ ఆమోదం తప్పనిసరి
- August 14, 2020
దుబాయ్ తిరిగి వచ్చే యూఏఈ ప్రవాసీయులు తప్పనిసరిగా ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని భారత్-యూఏఈకి సర్వీసులు అందిస్తున్న విమానయాన సంస్థలు కోరాయి. అయితే..గతంలో ఐసీఏ, జాతీయ అత్యవసర విపత్తుల నిర్వహణ అధికార విభాగం యూఏఈ తిరుగు ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా ఈ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తమ అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రయాణికులకు తెలియజేసింది. ముందస్తు అనుమతులు అవసరం లేదన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక నుంచి దుబాయ్ వెళ్లే ప్రవాసీయులు అంతా ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అలాగే దుబాయ్ వెళ్లే వాళ్లంతా దుబాయ్ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, అబుధాబి, షార్జా వెళ్లే వాళ్లంతా అల్ హోస్న్ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. మరోవైపు భారత్-యూఏఈ మధ్య సర్వీసులు నడుపుతున్న ఫ్లై దుబాయ్ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేయటం గమనార్హం. అటు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రయాణికులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలాఉంటే..దుబాయ్ వెళ్లే ప్రవాసీయుల ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశానికి సంబంధించి ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష