దుబాయ్ తిరిగి వచ్చే ప్రవాసీయులకు ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ ఆమోదం తప్పనిసరి
- August 14, 2020దుబాయ్ తిరిగి వచ్చే యూఏఈ ప్రవాసీయులు తప్పనిసరిగా ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని భారత్-యూఏఈకి సర్వీసులు అందిస్తున్న విమానయాన సంస్థలు కోరాయి. అయితే..గతంలో ఐసీఏ, జాతీయ అత్యవసర విపత్తుల నిర్వహణ అధికార విభాగం యూఏఈ తిరుగు ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు అనుమతులు అవసరం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా ఈ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తమ అధికార ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రయాణికులకు తెలియజేసింది. ముందస్తు అనుమతులు అవసరం లేదన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఇక నుంచి దుబాయ్ వెళ్లే ప్రవాసీయులు అంతా ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి ముందస్తు అనుమతి తీసుకుంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని స్పష్టం చేసింది. అలాగే దుబాయ్ వెళ్లే వాళ్లంతా దుబాయ్ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని, అబుధాబి, షార్జా వెళ్లే వాళ్లంతా అల్ హోస్న్ స్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించింది. మరోవైపు భారత్-యూఏఈ మధ్య సర్వీసులు నడుపుతున్న ఫ్లై దుబాయ్ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేయటం గమనార్హం. అటు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ కూడా ప్రయాణికులకు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదిలాఉంటే..దుబాయ్ వెళ్లే ప్రవాసీయుల ముందస్తు అనుమతి తప్పనిసరి అనే అంశానికి సంబంధించి ఐసీఏ/జీడీఆర్ఎఫ్ఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన