కువైట్: కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉంటేనే కొత్త వీసాల జారీ
- August 14, 2020
వివిధ దేశాల నుంచి కువైట్ రావాలనుకుంటున్న వారికి కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల కొత్త వీసాల జారీని నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే..కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉన్న వారికి మాత్రమే వీసాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఇక నుంచి కువైట్ రావాలనుకునే వాళ్లంతా తప్పనిసరిగా కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటిని ముందుకు సంప్రదించాల్సి ఉంటుంది. కమిటీ దరఖాస్తుదారులకు అనుమతి ఇచ్చిన తర్వాతే కొత్త వీసా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే లాక్ డౌన్ నుంచి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా కువైట్ వచ్చే మంగళవారం నుంచి నాలుగో దశ అన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే..పాక్షిక కర్ఫ్యూ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







