కువైట్: కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉంటేనే కొత్త వీసాల జారీ
- August 14, 2020వివిధ దేశాల నుంచి కువైట్ రావాలనుకుంటున్న వారికి కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల కొత్త వీసాల జారీని నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే..కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉన్న వారికి మాత్రమే వీసాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఇక నుంచి కువైట్ రావాలనుకునే వాళ్లంతా తప్పనిసరిగా కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటిని ముందుకు సంప్రదించాల్సి ఉంటుంది. కమిటీ దరఖాస్తుదారులకు అనుమతి ఇచ్చిన తర్వాతే కొత్త వీసా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే లాక్ డౌన్ నుంచి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా కువైట్ వచ్చే మంగళవారం నుంచి నాలుగో దశ అన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే..పాక్షిక కర్ఫ్యూ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం