కువైట్: కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉంటేనే కొత్త వీసాల జారీ

- August 14, 2020 , by Maagulf
కువైట్: కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉంటేనే కొత్త వీసాల జారీ

వివిధ దేశాల నుంచి కువైట్ రావాలనుకుంటున్న వారికి కువైట్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల కొత్త వీసాల జారీని నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే..కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటి అనుమతి ఉన్న వారికి మాత్రమే వీసాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో ఇక నుంచి కువైట్ రావాలనుకునే వాళ్లంతా తప్పనిసరిగా కరోనల్ ఎమర్జెన్సీ మినిస్టిరియల్ కమిటిని ముందుకు సంప్రదించాల్సి ఉంటుంది. కమిటీ దరఖాస్తుదారులకు అనుమతి ఇచ్చిన తర్వాతే కొత్త వీసా పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలాఉంటే లాక్ డౌన్ నుంచి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా కువైట్ వచ్చే మంగళవారం నుంచి నాలుగో దశ అన్ లాక్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే..పాక్షిక కర్ఫ్యూ సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com