అకామడేషన్స్లో తనిఖీలు కొనసాగుతాయ్
- August 14, 2020మనామా:సదరన్ గవర్నరేట్, లేబర్ అకామడేషన్లలో తనిఖీల్ని కొనసాగించనున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. గవర్నరేట్కి చెందిన ఇంజనీరింగ్ సర్వీసెస్ అలాగే ఇన్వెస్టిమెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఇంజనీర్ ఖాలిద్ అబ్దుల్లతీఫ్ హాజి నేతృత్వంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, సదరన్ ఏరియా మునిసిపాలిటీ అలాగే ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ సంయుక్తంగా ఈ తనిఖీల్ని నిర్వహించడం జరుగుతోంది. హాజి వెల్లడించిన వివరాల ప్రకారం 16 యూనిట్లను ఇప్పటికే తనిఖీలు చేశారు. ఉల్లంఘనులపై చర్యలు కూడా తీసుకున్నారు. క్రౌడ్ హౌసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు హాజి వివరించారు.
తాజా వార్తలు
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్