ఏపీలో కొత్తగా 8,012 కేసులు
- August 16, 2020
అమరావతి: ఏపీలో కొత్తగా మరో 8,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. మరణాల సంఖ్య 2,650 మందికి పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 48,746 నమూనాలను పరిశీలించినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 10,117 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు పేర్కొంది.
కరోనా కారణంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు, నెల్లూరు తొమ్మిది; అనంతపురం, పశ్చిమ గోదావరి ఎనిమిది మంది; విశాఖపట్నం ఏడుగురు; గుంటూరు, కడప ఆరుగురు; ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం నలుగురు; కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28.60 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పీ)
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్హౌస్కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









