'ఐ యామ్ యాన్ ఇండియన్' పాట ను విడుదల చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్
- August 16, 2020
హైదరాబాద్:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ఐ యామ్ యాన్ ఇండియన్' పాటను విడుదల చేసారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీ.సీ. సజ్జనార్, నిర్మాత చిల్లర కళ్యాణ్, నటుడు ఆలీ. గచ్చిబౌలి లోని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో S 5 సినిమాలోని ఈ పాటను ఆవిష్కరించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం, దేశ భద్రత మరియు అభివృద్ధి కోసం అందరం కృషి చేయాలని కోరారు. సమాజం మనకు ఏమీ చేసింది అనేది కాకుండా మనం సమాజం కోసం, దేశం కోసం ఏమీ చేశామన్నదే ముఖ్యమనే అబ్రహం లింకన్ మాటలను గుర్తు చేసుకున్నారు.
S 5 సినిమా లో 'ఐ యామ్ యాన్ ఇండియన్' పాట పాడిన సింగర్ శ్రీరామ చంద్ర, S 5 సినిమా డైరెక్టర్ సన్నీ లతో పాటు సినిమా కు పనిచేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. రాబోయే గణేష్ ఉత్సవాలలో ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సీడ్ గణేష్ ను నెలకొల్పి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కరోనా మహమ్మారి విజృంబిస్తున్న తరుణంలో ప్లాస్మా డోనేషన్ చాల ముఖ్యమైనదని, కాబట్టి ప్రతి సినీ హిరో అభిమానులు ప్లాస్మా డోనేషన్ కు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.

తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







